‘రియల్ లైఫ్లో జరిగిన ఓ చిలిపి దొంగతనం కేసు గురించి ఈ సినిమా డీవోపీ కార్తీక్ ఘట్టమనేని ఓ సందర్భంలో నాకు చెప్పారు. ‘సినిమా చేద్దాం.. దాన్ని కథగా రాయి’ అని అడిగాను. అలా ‘చౌర్యపాఠం’ ప్రయాణం మొదలైంది.’ అని ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు అన్నారు. ‘చౌర్యపాఠం’ సినిమాతో ఆయన నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. నిఖిల్ గొల్లమారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంద్ర రామ్ కథానాయకుడు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం నక్కిన త్రినాథరావు విలేకరులతో మాట్లాడారు. ‘దొంగతనం చేయాలనుకునేవారికి ఈ సినిమా ఓ పాఠం. హీరో ఇంద్ర రామ్, కథానాయిక పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల అందరూ అద్భుతంగా నటించారు. మ్యూజిక్ కూడా చాలా బావుంటుంది. అందర్నీ ఈ సినిమా తప్పక అలరిస్తుంది’ అని త్రినాథరావు నక్కిన చెప్పారు.