బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన వాళ్లే ఇప్పుడు ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. అలాంటిది దంగల్ బ్యూటీ సన్య మల్హోత్ర ఇల్లు కొనడంలో పెద్ద వింతేమి ఉంటుంది అంటారా. ఆమె కొన్నది. ముంబయిలోని అత్యంత ఖరీదైన ఏరియా అయిన జుహు ప్రాంతంలో. ఒక అపార్ట్ మెంట్ లో ప్లాట్ ను కొనుగోలు చేసిన సన్య ప్రస్తుతం ఇంటికి మెరుగులు చేయిస్తుందట.
గత ఏడాది అదే అపార్ట్ మెంట్ లో బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ దాదాపుగా 100 కోట్లకు పైగా ఖర్చు చేసి అత్యాధునిక హంగులు ఉన్న ప్లాట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు అదే అపార్ట్ మెంట్ లో సన్య ప్లాట్ కొనుగోలు చేసి హృతిక్ రోషన్ కు నైబర్ గా మారిపోయింది.
సన్య మల్హోత్ర దాదాపుగా 15 కోట్లు పెట్టి ఆ ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు మరి కొంత పెట్టి తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్ ను డిజైన్ చేయించుకుందట. అత్యంత సుందరంగా తయారు చేయించుకున్న తన సొంత ఇంటికి దీపావళి సందర్బంగా వెళ్లినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. దంగల్ సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్న సన్య ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కూడా ఈమె నటించిన మీనాక్షి సుందరేశ్వర్ విడుదలకు సిద్దంగా ఉంది.