బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఆయన హిందీలో ఎన్నో హిట్స్ తీసి అలరించారు. సంజయ్ నటించిన పలు సినిమాలు తెలుగులో రీమేక్ కాగా,వాటికి మంచిఆదరణ లభించింది. అయితే సంజయ్ దత్ కెరీర్ పీక్స్లో ఉండగా ఆయన జైలుకి వెళ్లడం వచ్చాక అనారోగ్యానికి గురి కావడంతో ఆయన సినిమాల సంఖ్య తగ్గింది.
ప్రస్తుతం సంజయ్ దత్.. నార్త్తో పాటు సౌత్ సినిమాలపై కూడా దృష్టి పెడుతున్నారు. ఆ మధ్య కేజీఎఫ్ 2 లో అధీరాగా నటించారు. ఈ సినిమా విడుదల కావలసి ఉంది. బాలకృష్ణ అఖండ సినిమాలోనే సంజయ్ దత్ ను నటింపజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది వార్తలు వచ్చాయి. కాని ఆ సమయంలో సంజయ్ దత్ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయన సినిమాను చేయలేక పోయాడు.
ఇప్పుడు మహేష్- త్రివిక్రమ్ సినిమాలో ఆయనకు కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చడం తో పాటు పవర్ ఫుల్ పొలిటికల్ పర్సన్ పాత్ర అవ్వడం వల్ల సంజయ్ దత్ ఓకే చెప్పాడు అనేది సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. ప్రస్తుతం మహేష్.. సర్కారు వారి పాట చిత్రం చేస్తుండగా, ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మూవీ చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. పార్థు అనే టైటిల్ తో ఈ సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి.