బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటుడిగా ఎన్నో కీర్తి ప్రతిష్టలు పొందారు. కాని పర్సనల్ లైఫ్లో మాత్రం అనేక వివాదాలలో నిలిచి హాట్ టాపిక్గా మారారు. తాజాగా సంజయ్ దత్ కు అరుదైన గౌరవం లభించింది. టాంజానియా దేశంలోని జాంజిబార్ సినీ రంగానికి పర్యాటక అంబాసిడర్గా సంజయ్ దత్ నియామకమయ్యారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్గా సంజయ్ని నియమించుకున్నారు.
ఈ క్రమంలో సంతోషం వ్యక్తం చేసిన సంజయ్ దత్.. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. జాంజిబార్లోని పెట్టుబడులు ఆరోగ్యం , విద్యా రంగానికి సహకరించే అవకాశం లభించడంతోపాటు మీ ప్రభుత్వ సహకారంతో ఈ అందమైన ద్వీప నగరానికి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అంబాసిడర్గా ఉన్నందుకు గౌరవంగా ఉందని సంజయ్ అన్నారు. సంజయ్ టాంజానియా ప్రధానమంత్రిని కలుసుకున్నారు. అతనితో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసారు.
భారతదేశంలోనే అతిపెద్ద ముంబై బాంబు పేలుళ్ల కేసుల్లో జైలు జీవితం గడిపినప్పటికీ సంజయ్ దత్ భారతదేశంలో అత్యంత బిజీగా ఉన్న నటులలో ఒకరు కావడం విశేషం. ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తున్నాడు.