Animal Movie | బాలీవుడ్లో ప్రస్తుతం ‘యానిమల్’ (Animal) సినిమా హవా నడుస్తున్న విషయం తెలిసిందే. రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా ఈ సినిమా 19 రోజులకు రూ.7850 కోట్ల మార్కును దాటేసింది. అయితే ఈ మూవీపై రివ్యూలు ఇచ్చిన బాలీవుడ్ క్రిటిక్స్పై సందీప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
యానిమల్ సక్సెస్ మూడ్లో ఉన్న సందీప్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందీప్ బాలీవుడ్ క్రిటిక్స్పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
అనుపమ చోప్రా, రాజీవ్ మసంద్, సుచిత్ర త్యాగి లాంటి బాలీవుడ్ క్రిటిక్స్ సినిమాలపై అవగాహన లేకుండానే రివ్యూలు ఇస్తున్నట్లు సందీప్ ఆరోపించాడు. గత 5 ఇయర్స్ నుంచి నేను ముంబయిలో ఉండడం వలన నాకో విషయం తెలిసింది. బాలీవుడ్లో ఒక క్రిటిక్స్ టీమ్ ఉందని.. వారికి సినిమాను ఎలా చూడాలో అసలు తెలిదని.. కానీ అలాంటి వారు సినిమాలపై రివ్యూలు ఇస్తారని తెలిపాడు. ఈ టీమ్కు కొన్ని సినిమాలు మాత్రమే నచ్చుతాయని.. మిగత సినిమాలు వారికి అర్థం కాకపోతే బ్యాడ్ రివ్యూలు ఇస్తారని.. నా మొదటి మూవీ అర్జున్ రెడ్డి విషయంలో కూడా ఇలాగే జరిగిందని సందీప్ తెలిపాడు. క్రిటిక్స్కు డబ్బులు ఇచ్చే కల్చర్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉందని.. అయితే నేను ఎప్పడు డబ్బులు ఇచ్చి రివ్యూలు కొనుక్కోలేదని సందీప్ వెల్లడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
just Sandeep Reddy Vanga things 💥
giving belt treatment to chu critics Anupama, Rajeev, Suchitra Tyagi pic.twitter.com/wxt9lhPeF8— A. (@HypocriteAman) December 19, 2023