సందీప్ మాధవ్, గాయత్రి ఆర్ సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘గంధర్వ’. సబాని నిర్మాత. అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 8న ఈ సినిమా విడుదలకానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ…‘ఊరి చివర రైతు యుద్ధం చేస్తే, సైనికుడు సరిహద్దులో యుద్ధం చేస్తాడు. నిత్య జీవితంలో మనకూ పోరాటం తప్పదు. కుటుంబం కోసం ఒక వ్యక్తి చేసిన పోరాటమే ఈ సినిమా. గంధర్వుడు అంటే నిత్య యవ్వనుడు. ఫిక్షన్ కథతో యాంటీ ఏజింగ్ అనే అంశం నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది’ అన్నారు. ‘దర్శకుడు అప్సర్ చెప్పిన కథ వినూత్నంగా అనిపించింది. నిర్మాత రాజీ పడకుండా నిర్మించారు. ఈ సినిమాలో పలువురు సీనియర్ యాక్టర్స్తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. నాకు పేరు తెచ్చే సినిమా అవుతుంది’ అని హీరో సందీప్ మాధవ్ అన్నారు.