samyuktha menon | ‘భీమ్లానాయక్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ సోయగం సంయుక్తమీనన్ ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్లో మూడు చిత్రాల్లో నటిస్తున్నది. తాజాగా ఆమె మరో భారీ ఆఫర్ను దక్కించుకుంది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ-2: తాండవం’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్ ఇది.
14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో సంయుక్తమీనన్ కథానాయికగా ఖరారైంది. కథాగమనంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు.