అక్కినేని కోడలు సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. భారీ పౌరాణిక చిత్రంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకున్న శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపై ఆవిష్కృతం చేయబోతున్నారు గుణశేఖర్ . ఇందులో ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు.
శాకుంతలం చిత్రం అభిమానులకి చాలా స్పెషల్ కానుంది. అందుకు కారణం ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అర్హ వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇక సమంత తన కెరీర్లో తొలిసారి పౌరాణిక పాత్రలో నటించడం విశేషం. చాలా ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ చిత్ర షూటింగ్ ఎట్టకేలకు పూర్తైంది. మంగళవారం విజయవంతంగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశామని పేర్కొంటూ అఫీషియల్ వీడియో రిలీజ్ చేసింది. దర్శకుడు గుణ శేఖర్, చిత్ర నిర్మాత నీలిమా యూనిట్ మొత్తానికి చిరు కానుకలు ఇచ్చారు.
చిత్ర బృందానికి వీడ్కోలు పలుకుతూ దర్శక నిర్మాతలు కాస్త ఎమోషనల్గా ఫీల్ కావడం ఈ వీడియోలో చూడొచ్చు. దిల్రాజు ప్రొడక్షన్స్, గుణటీమ్ వర్క్స్ పతాకాలపై పాన్ ఇండియా మూవీగా నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.