నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత హాట్ టాపిక్గా మారుతుంది. ఆమెకు సంబంధించిన ఏ విషయమైన వైరల్గా మారుతుంది. ఈ అమ్మడు ఆ బాధ నుంచి బయటపడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది . దగ్గరి స్నేహితులతో సరదాగా విదేశాలు చుట్టి వస్తూ పలు పార్టీలు అటెండ్ అవుతోంది. తాజాగా హైదరాబాద్లోని తన ఇంట్లో దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సంబరాల్లో మెగా కోడలు ఉపాసన కూడా కనిపించడం విశేషం.
గత కొద్ది రోజులుగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలలో తెగ యాక్టివ్గా ఉంటోంది. ఇటీవల ఆమె చేస్తున్న పోస్ట్స్ తన పరిస్థితిని వివరించేలా కనిపిస్తున్నాయి. అమ్మ చెప్పింది అనే హ్యాష్ ట్యాగ్స్ తో సమంత చేస్తున్న పోస్ట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా సంతోషమే అసలైన ఆస్తి.. మానసిక ప్రశాంతతే అసలైన విజయం.. ఆరోగ్యమే ఐశ్వర్యం..దయాగుణమే పరివర్తన అంటూ ఆసక్తికర పోస్ట్ చేసింది.ఈ పోస్ట్పై నెటిజన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సామ్… నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. అలాగే తమిళంలో ఓ మూవీ చేస్తుంది. బాలీవుడ్ ఎంట్రీకి కూడా సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.రీసెంట్గా సమంతకు సంబంధించిన రెండు ప్రాజెక్టుల అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే.