Pushpa The Rule | టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాను సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందనా హీరోయిన్గా నటిస్తుంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప.. ది రైజ్కు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు ఒక సాలిడ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో స్టార్ నటి సమంతా అతిథి పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి పార్టులో సమంతా స్పెషల్ సాంగ్ (Oo antava Mava)తో కుర్రకారును ఉర్రుతలుగించిన విషయం తెలిసిందే. తాజాగా సెకండ్ పార్ట్ లో కూడా సమంత ఉంటుంది అని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్కు ఫుల్ మీల్సే అంటున్నారు నెటిజన్లు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.