సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, మధుబాల, గౌతమి ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు చిత్రబృందం. దర్శకుడు గుణశేఖర్, నాయిక సమంత, నటుడు దేవ్ మోహన్ ఆలయంలో పూజలు జరిపారు. అనంతరం సమంత స్పందిస్తూ…‘నాకు చిన్నప్పటి నుంచి డిస్నీ మూవీస్ అంటే ఇష్టం. అలాంటి సినిమాలో నటించాలనే కల ఉండేది. తాజాగా ‘శాకుంతలం’ సినిమాను వీక్షించాను. సినిమా చూస్తున్నంత సేపు నా కల నెరవేరిన అనుభూతి కలిగింది.’ అని పేర్కొంది.