డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోను ఆయన డిఫరెంట్ కంటెంట్తో చిత్రాలు తెరకెక్కించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘బుడ్డా హోగా తేరే బాప్’ అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు పూరి జగన్నాథ్. త్వరలో ఆయన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో సినిమా చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పలు క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సల్మాన్ కు మైత్రీ టీమ్ పది కోట్ల అడ్వాన్స్ కూడా చెల్లించారని.. అందుకుగాను 2023 లో డేట్స్ ఇచ్చాడని చెప్పుకున్నారు.
ఈ ప్రాజెక్ట్కి పూరీ జగన్నాథ్ సరైన డైరెక్టర్ అని నిర్మాణ సంస్థ భావిస్తుందట. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరీ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ”లైగర్” అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత నందమూరి బాలకృష్ణతో పూరీ ఓ మూవీ ప్లాన్ చెయ్యబోతున్నాడు.మంచి జోరు మీదున్న పూరీ.. సల్మాన్తో సినిమా చేస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు.కాగా, మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హిందీలో ‘వాంటెడ్’ పేరుతో రీమేక్ చేసి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.