బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘కభీ ఈద్ కభీ దివాలి’. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు కూడా సల్మాన్ తీసుకున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తుండగా…వెంకటేష్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
సల్మాన్ ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో చేయబోతున్నారు. ఇటీవలే ముంబైలో షెడ్యూల్ కంప్లీట్ చేసిన సల్మాన్..తదుపరి సన్నివేశాలు నగరంలో చిత్రీకరించనున్నారు. ముంబైలో ఉన్నట్లే ఇక్కడా సెట్ నిర్మించి అందులో షూటింగ్ చేస్తారట. ఈ సెట్ను షూటింగ్ తర్వాత కూడా అలాగే ఉంచి మిగతా చిత్రాల రూపకల్పనకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ 30న సినిమా రిలీజ్ డేట్గా ప్రకటించారు.