Cinema News | ప్రస్తుతం బాలీవుడ్లో యాక్షన్ సినిమాల హవా నడుస్తున్నది. పఠాన్, జవాన్ చిత్రాలు గత ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో అగ్ర హీరోలు యాక్షన్ బాట పడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్ ఓ పాన్ ఇండియా యాక్షన్ మూవీ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బాలీవుడ్లో తన సన్నిహిత మిత్రుడు సాజిద్ నదియావాలా నిర్మించే ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించబోతున్నారు.
ఈ ప్రాజెక్ట్ సంబంధించి గత రెండేళ్లుగా మురుగదాస్, సాజిత్ నదియావాలా మధ్య చర్చలు నడుస్తున్నాయని, ఇటీవల స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశారని బాలీవుడ్లో వినిపిస్తున్నది. గత కొంతకాలంగా బాలీవుడ్లో కమ్బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు మురుగదాస్ ఈ సినిమా కోసం పవర్ఫుల్ యాక్షన్ కథను సిద్ధం చేశారని తెలిసింది. ఈ వేసవిలో సెట్స్పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.