బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖలు రాగా..పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. కాగా ఈ నేపథ్యంలో మరోవైపు సల్మాన్ ఖాన్కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు సల్మాన్ ఖాన్.
ఫర్హద్ సామ్జీ (Farhad Samji) డైరెక్షన్లో చేస్తున్న కభీ ఈద్ కభీ దివాళి (Kabhi Eid Kabhi Diwali) షూటింగ్ లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. పూజాహెగ్డేతో కలిసి నటిస్తోన్న కభీ ఈద్ కభీ దివాళి ఈ షెడ్యూల్ కోసం రామోజీఫిలింసిటీలో భారీ సెట్ వేశారట మేకర్స్. ఈ సెట్స్ లో సుమారు నెల రోజులపాటు షూటింగ్ జరుగనుందని ఫిలినగర్ సర్కిల్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
త్వరలోనే వెంకీ కూడా షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. మొత్తానికి సల్లూభాయ్ ఏ మాత్రం ఆందోళన చెందకుండా పోలీసుల భద్రతల నడుమ షూటింగ్తో బిజీగా మారి తన అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ ఈ సారి కొత్త ప్లాన్తో వస్తున్నాడా..?
Read Also : Sharwanand | శర్వానంద్కు జోడీగా రాశీఖన్నా..షూటింగ్ షురూ ఎప్పుడంటే..!