Salaar Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 – Ceasefire) కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదల కానుంది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడా చూద్దామా అని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక శుక్రవారం కర్ణాటకలో ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయని మేకర్స్ ప్రకటించారు కానీ ఇంకా బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు.
అయితే ఈ అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఎగబడుతున్నారు. దీంతో ఫస్ట్ డే టికెట్స్ దొరుకుతాయా లేదా అని చాలా టెన్షన్ పడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే వారికి ఒక సాలిడ్ గుడ్ న్యూస్ అందించాడు టాలీవుడ్ కుర్ర హీరో నిఖిల్.
ప్రభాస్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో డిసెంబర్ 21న అర్ధరాత్రి 1 గంటలకు సలార్ షో పడుతుందని, ఈ షోకి 100 మంది ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్కి ఫ్రీగా టికెట్స్ ఇస్తానని, వారితో కలిసి సినిమా చూస్తానని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పదేళ్ల క్రితం ఇదే థియేటర్లో మిర్చి సినిమా రాత్రి ఒంటిగంట షో చూశాను, ఇప్పుడు సలార్ సినిమాతో హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది.. అంటూ రాసుకోచ్చాడు నిఖిల్. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ ఫ్రీ టికెట్స్ ఎలా తీసకోవాలి అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు నిఖిల్.
Giving away 100 Tickets for the 1 am show #SALAAR along with me at #SriRamulu Theatre… especially to DieHard fans of #Darling #Prabhas bhai.. #OnPublicDemand
10 years back I watched the 1 am Special show of #Mirchi movie at the same theatre.. let History Repeat 🔥 https://t.co/jstXB6Lm0r— Nikhil Siddhartha (@actor_Nikhil) December 16, 2023
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో తొలి భాగం సలార్ సీజ్ ఫైర్ పేరుతో డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఒక క్యారెక్టర్ దేవా కాగా.. రెండో క్యారెక్టర్ సలార్ అని తెలుస్తుంది. తొలి పార్టులో దేవా గురించి చెప్పి.. రెండో పార్టులో సలార్ గురించి చెప్పనున్నారట. పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది.