హైదరాబాద్ : నటుడు సాయిధరమ్ తేజ్ ( Saidharam Tej ) ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఐసీయూలోనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం. వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోందని వైద్యులు వెల్లడించారు.
ఈ నెల 10వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రోడ్డు వైపు వెళ్తుండగా సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి ( TS07GJ1258 ) గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్ చికిత్స పొందుతున్నారు.