Saipallavi | అగ్ర కథానాయిక సాయిపల్లవిలో ఆధ్మాత్మిక భావాలు ఎక్కువ. ప్రకృతి ఒడిలో సేదతీరడం తనకెంతో ఇష్టమని అనేక సందర్భాల్లో చెప్పిందీ భామ. శివకార్తికేయన్తో సాయిపల్లవి జోడీగా నటిస్తున్న తాజా చిత్రం ఇటీవలే కశ్మీర్లో ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడి సుందరమైన ప్రదేశాల్లో విహరిస్తూ వివిధ ఆలయాలను దర్శించుకొని పూజలు నిర్వహించింది సాయిపల్లవి.
తన కశ్మీర్ విహారానికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘ప్రస్తుతం నేను ప్రశాంతమైన మానసిక స్థితిని అనుభవిస్తున్నా’ అంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్ను జత చేసింది. ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్గా ఉంటున్నది సాయిపల్లవి. తెలుగులో ‘విరాట పర్వం’ తర్వాత మరే చిత్రాన్ని అంగీకరించలేదు.