Sai Pallavi | ‘కమల్హాసన్సార్ నా ఫేవరెట్ యాక్టర్. ‘మహానది’ సినిమా అంటే నాకు పిచ్చి. ఎన్నిసార్లు చూశానో లేక్కేలేదు. కమల్సార్ని చూస్తే చాలు అనుకునేదాన్ని. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో నటిస్తున్నాను. ఆయనతో ఇప్పటివరకూ నటించే అవకాశం రానందుకు బాధగా ఉంది’ అంటున్నది అందాలతార సాయిపల్లవి. ఆమె ప్రస్తుతం శివకార్తికేయన్ ‘ఎస్కే 21’లో కథానాయికగా నటిస్తున్నది. ఆర్.మహేంద్రన్, వివేక్ కృష్ణానిలతో కలిసి కమల్హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గురించి ఇటీవల మీడియాతో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది సాయిపల్లవి. ‘ ఈ సినిమా షూటింగ్ టైమ్లో కమల్సార్ని కలిశాను. ఆయన నవ్వుతూ పలకరించిన తీరు జీవితంలో మరిచిపోలేను. అదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇక ఇందులోని నా పాత్ర విషయానికొస్తే.. ప్రేయసిగా, భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా రకరకాల పార్శాలతో కూడుకున్న పాత్ర నాది. అరుదుగా మాత్రమే ఇలాంటి పాత్రలు దొరుకుతుంటాయి.
తమిళంతోపాటు తెలుగులో కూడా ఓకేసారి విడుదలవుతుందీ సినిమా. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని చెప్పింది సాయిపల్లవి. ఇదిలావుంటే.. రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని కథానాయిక పాత్ర కోసం చాలామంది హీరోయిన్లు ప్రయత్నించారని సమాచారం. అయితే, దర్శకుడు దృష్టిలో ఉన్న హీరోయిన్లు మాత్రం సాయిపల్లవి, రష్మిక మాత్రమేనట. వీరిద్దరిలో ఒకర్ని తీసుకోవాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారంట. అలా వీరిద్దరి మధ్య పోటీ నెలకొనగా.. చివరకు సాయిపల్లవినే ఈ పాత్ర వరించడం విశేషం. ఈ సినిమాతోపాటు తెలుగులో ‘తండేల్’, బాలీవుడ్లో ‘రామాయణం’ చిత్రాల్లో సాయిపల్లవి నటిస్తున్న విషయం
తెలిసిందే.