మణిరత్నం దర్శకత్వంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న తాజా ప్రేమకథా చిత్రంపై తమిళనాట ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. విజయ్సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 5 నుంచి కోల్కతాలో మొదలుకానుంది.
దాదాపు 20రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుగుతుందని, కేవలం 50 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని దర్శకుడు మణిరత్నం లక్ష్యంగా పెట్టుకున్నారని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్నది. సుదీర్ఘ విరామం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో లవ్స్టోరీ రాబోతుండటం, అందులో నాయికగా సాయిపల్లవి నటిస్తుండటంతో ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. భారీ మొత్తానికి డిజిటల్ హక్కులను కొనుగోలు చేశారని తెలిసింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.