యాదగిరిగుట్ట, మే 19 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని సినీ నటుడు సాయికుమార్ శుక్రవారం సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం యాదగిరి కొండకు చేరుకుని స్వయంభూ పంచనారసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.