Sai Durga Tej | టాలీవుడ్ నటుడు సాయి దుర్గ తేజ్కు ‘మోస్ట్ డిజైరబుల్ మేల్’ అవార్డు లభించింది. శనివారం హైదరాబాద్లోని పార్క్ హయత్లో జరిగిన యూజెనిక్స్ ఫిల్మ్ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 ప్రారంభోత్సవంలో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్కు ‘మోస్ట్ డిజైరబుల్ మేల్’ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో దక్షిణాది సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ అవార్డును సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించారు. అయితే, సాయి దుర్గ తేజ్ తన తల్లిదండ్రులు విజయ దుర్గ, శివ ప్రసాద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన తల్లికి ఈ గౌరవాన్ని అంకితం చేశారు. రోడ్డు ప్రమాదం తర్వాత తన తల్లి కంటికి రెప్పలా చూసుకుందని గుర్తు చేసుకున్నారు. “నేను అన్నీ కోల్పోయానని అనుకున్నప్పుడు, నా తల్లి నాకు అండగా నిలిచి ధైర్యం చెప్పారు. ఆమె నా ఆత్మవిశ్వాసాన్ని పెంచి నన్ను సాధారణ స్థితికి తీసుకువచ్చారు” అని అన్నారు.
తన స్టైల్ గురించి చెబుతూ, “కంఫర్టబుల్గా ఉండే దుస్తులు ధరించండి, ప్రశాంతంగా, సంతోషంగా ఉండండి” అని సాయి దుర్గ తేజ్ సందేశం ఇచ్చారు. తన స్టైల్ ఐకాన్లుగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్లను ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్ ‘ఆరెంజ్’ సినిమా లుక్స్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి నాని, అడివి శేష్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, మాళవిక మోహనన్, తేజ సజ్జ, అనిల్ రావిపూడి, నాగ వంశీ, ప్రగ్యా జైస్వాల్, రాశి ఖన్నా, మంచు లక్ష్మి, భాగ్యశ్రీ బోర్సే, అదితి రావు హైదరి, సిద్ధార్థ్, చిన్మయి శ్రీపాద, దేవి శ్రీ ప్రసాద్ వంటి అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి దర్శకత్వంలో రూపొందుతున్న హై-బడ్జెట్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు (SYG)’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 చివరిలో విడుదల కానుంది.