సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా సంపత్నంది దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తాజా చిత్రానికి ‘గాంజా శంకర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నది. ఆదివారం సాయిధరమ్తేజ్ పాత్రను పరిచయం చేస్తూ అనౌన్స్మెంట్ టీజర్ను విడుదల చేశారు. దర్శకుడు సంపత్నంది వాయిస్ ఓవర్తో ఆరంభమైన ఈ వీడియో గాంజా శంకర్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆద్యంతం మాస్ అంశాలతో సాగింది. తన శత్రువులపై గాంజా శంకర్ త్వరలో మాస్ దాడిని ఆరంభించబోతున్నాడంటూ దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, దర్శకత్వం: సంపత్నంది.