sai dharam tej voice message | మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సుమారు రెండు నెలల క్రితం వినాయక చవితి రోజున బైక్పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి దాదాపు 40 రోజులకు పైగా అపోలో ఆస్పత్రిలో ఉండి సురక్షితంగా బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. గాయాలు పూర్తిగా నయం అయినా కూడా బాగా సన్నబడిపోయాడు తేజూ. ఈయన పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుంది. అప్పటివరకు షూటింగ్స్ ఏమీ ఉండవు. 2022 ఫిబ్రవరి తర్వాతే సాయి ధరమ్ తేజ్ కెమెరా ముందుకొస్తాడు. దానికి చాలా టైం ఉండటంతో తాజాగా అభిమానులకు టచ్లోకి వచ్చాడు తేజూ. ఫ్యాన్స్ కోసం ఒక వాయిస్ మెసేజ్ను పంపించాడు.
యాక్సిడెంట్ తర్వాత దాదాపు 40 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సాయిధరమ్ తేజ్ ఎలా ఉన్నాడని మెగా అభిమానులు చాలా ఆందోళనపడ్డారు. దీంతో దీపావళి సందర్భంగా సాయిధరమ్ తేజ్ ఫొటోను మెగా ఫ్యామిలీ విడుదల చేసింది. అందులో తేజూ సన్నగా ఉన్నాడు. అయితే యాక్సిడెంట్ తర్వాత ఇప్పటివరకు ఆయన వాయిస్ మాత్రం బయటకు రాలేదు. ఒక్కసారి కూడా ఆడియో, వీడియో బైట్ బయటకు ఇవ్వలేదు. ఇన్ని రోజులకు అభిమానుల కోసం ఒక వాయిస్ మెసేజ్ పంపించాడు. నవంబర్ 26న రిపబ్లిక్ సినిమా జీ 5 ( Zee 5 ) ఓటీటీ వేదికగా విడుదల కానుంది.ఈ సందర్భంగా ఫ్యాన్స్కు వాయిస్ మెసేజ్ పంపించాడు తేజూ.
నేను మీ సాయిధరమ్ తేజ్.. మీరు నా మీద చూపించిన ప్రేమకు ఎప్పుడు రుణపడి ఉంటాను.. నా ఆరోగ్యంపై మీరు చూపించిన శ్రద్ధ ఎప్పటికీ మర్చిపోలేను.. రిపబ్లిక్ సినిమాను మీతో కలిసి చూడలేకపోయాను.. కానీ ఇప్పుడు నవంబర్ 26న ఈ సినిమా Zee 5లో విడుదల అవుతుంది.. ఈ సినిమాను చూసి మీ అభిప్రాయాలు నాకు తెలపండి అంటూ వాయిస్ మెసేజ్ పంపించాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్టోబర్ 1 న విడుదలైన రిపబ్లిక్ దాదాపు 50 రోజుల తర్వాత OTTలో విడుదలవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఫిజిక్పై ఫోకస్ చేసిన సాయి ధరమ్ తేజ్.. షూటింగ్కు వచ్చేదప్పుడే..!
ఓటీటీలో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా.. ఎప్పట్నుంచి అంటే..
AP Govt Cinema Tickets | పెద్ద సినిమాలకు ఏపీ ప్రభుత్వం షాక్..ఇకపై ప్రభుత్వ నిర్ణయం మేరకే..
Rashmika: విజయ్ దేవరకొండని కలిసేందుకు యూఎస్ వెళుతున్నావా రష్మిక..!
Jayasudha: జయసుధ మొహం ఇలా అయిపోయిందేంటి?