మేనల్లుడు సాయిధరమ్తేజ్తో కలిసి అగ్రహీరో పవన్కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. జూలై 28 న విడుదలకానుంది. సోమవారం ‘బ్రో ద్వయం’ పేరుతో పవన్కల్యాణ్, సాయిధరమ్తేజ్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో సాయిధరమ్తేజ్ చేతిలో చేయి వేసి తాను అండగా ఉంటాననే భరోసా ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నారు పవన్కల్యాణ్. ‘ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మనిషి రూపంలో ఉన్న దేవుడి పాత్రలో పవన్కల్యాణ్ కనిపించనున్నారు. ఓ సామాన్య యువకుడికి తోడుగా ఉంటూ అతని కష్టాలను ఎలా తీర్చాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. కేతికశర్మ, ప్రియాప్రకాష్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ వాసుదేవ్, సంగీతం: తమన్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, రచన-దర్శకత్వం: సముద్రఖని.