లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సింగ్ గీతం’. ప్రముఖ నిర్మాత నాగ్అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తొలిటికెట్ను అగ్ర దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాత నాగ్అశ్విన్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్తో కలిసి ప్రత్యేకంగా ముచ్చటించారు. రాజమౌళి మాట్లాడుతూ ‘ఈ సినిమా ఐడియాను నా సోదరుడు కీరవాణి ద్వారా 1995లో విన్నాను.
తొలిసారి ఈ కథ విని ఆశ్చర్యపోయాను. ఇది పూర్తిగా ఎవరికీ తట్టని ఆలోచనగా అనిపించింది. ఇంత వినూత్నమైన కథను తెరపైకి తీసుకురావడానికి అంతే వినూత్నంగా ఆలోచించే వ్యక్తి కావాలి. ఆ పని చేయడానికి నాగ్అశ్విన్ సరైన వ్యక్తి’ అని అన్నారు. ప్రేక్షకులు వెండితెరపై చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చిత్రమిదని నాగ్అశ్విన్ అన్నారు. ఈ సినిమా కోసం ముందుగానే సంగీత ప్రపంచాన్ని నిర్మించామని, ఈ ప్రక్రియలో వందలాది ట్యూన్స్ కంపోజ్ చేశామని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తెలిపారు.