Prudhvi Raj | టాలీవుడ్ సీనియర్ నటుడు పృథ్వీ రాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా నటించారు. ఇక ‘పెళ్లి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే పృథ్వీ రాజ్ తన రెండో భార్య రుక్మిణి శీతల్కు విడాకులు ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు అమ్మాయి అయిన రుక్మిణీ శీతల్.. పృథ్వీరాజ్ కంటే చాలా చిన్నది. దాదాపుగా వీరి మధ్య 30 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. అయితే వీరి మధ్య మనస్పర్థాలు రావడంతో డివోర్స్ తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ డివోర్స్ వార్తలపై రుక్మిణీ శీతల్ తాజాగా షాకింగ్ న్యూస్ ఇచ్చింది.
పృథ్వీరాజ్తో తాను డివోర్స్ తీసుకోలేదని ప్రకటించింది. మాకు పెళ్లి కాలేదు. ఇప్పటివరకు మేము లివ్ ఇన్లో ఉన్నాం. అనుకోని కారణాల వల్ల మా రిలేషన్ను ముందుకు సాగించలేకపోతున్నాం. కాబట్టి, మేమిద్దరం వేర్వేరుగా ముందుకుసాగాల్సిన సమయం వచ్చింది. అందుకే విడిపోతున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి దయచేసి మాకు కాస్త సమయం ఇవ్వండి అంటూ శీతల్ పోస్ట్ చేసింది.
1994లో తొలిసారి బీనాను వివాహం చేసుకున్నాడు పృథ్వీరాజ్. వీరిద్దరికీ ఓ బాబు అహద్ మెహన్ జబ్బర్ అనే కొడుకు పుట్టాడు. అయితే చాలా కాలంపాటు అన్యోన్యంగా ఉన్న వీరి జంట మధ్య సమస్యలు రావడంతో దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే ఇద్దరూ కలిసి ఆరు సంవత్సరాల పాటు విడివిడిగా జీవించారు. 2022లోనే చట్టబద్ధంగా విడాకులు తీసుకొని వేరయ్యారు. ఆ తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్న పృథ్వీరాజ్.. రుక్మిణి శీతల్ కు దగ్గరయ్యాడు.