దర్శక ధీరుడు రాజమౌళి తన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ని సరికొత్త స్టైల్లో ప్రమోట్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను పది రోజుల పాటు ఎన్టీఆర్కి అప్పగించాడు. దీంతో ఎన్టీఆర్ ఉక్రెయిన్ సంగతులని వీడియోలుగా విడుదల చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం రెండు పాటల షూటింగ్ నిమిత్తం ఉక్రెయిన్లో ఉన్న సంగతి తెలిసిందే.
రీసెంట్గా ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని అప్లోడ్ చేశాడు ఎన్టీఆర్ .ఇందులో ‘డ్రమ్స్ ప్రాక్టీస్ అయ్యిందా’ అని చరణ్ని ఎన్టీఆర్ అడిగాడు. చరణ్ టేబుల్పై దరువేసి అయిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత ‘డ్రమ్స్ లేవు. కాస్ట్యూమ్స్ లేవు. పొద్దున్నే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దసరాకి రిలీజ్ అంటున్నారు’ అంటూ ఎదురుగా ఉన్న కార్తికేయని అడుగుతున్నాడు చరణ్. ఆ వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంది.
ఇక తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ షూట్లో పాల్గొనేందుకు వెళుతున్న వీడియోని షేర్ చేశారు. ఇద్దరు కారులో దోస్త్ సాంగ్ వినుకుంటూ వెళుతుండగా, సాంగ్ని ఎన్టీఆర్ మస్త్ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించారు. అయితే ఈ వీడియోకి దోస్త్తో షూటింగ్లో పాల్గొనేందుకు వెళుతున్నాను అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కొత్త పద్ధతిలో చేస్తున్న ప్రమోషన్ అందరు నోరెళ్లపెట్టేలా చేస్తుంది. అక్టోబర్ 13న విడుదల కానున్న ఈ సినిమా రూ.450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుండగా, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.