దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలంటే జనాలలో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో చరిత్రలు సృష్టించిన జక్కన్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో జక్కన్న సినిమా చేయగా, ఈ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.రూ.450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.
రాజమౌళి సినిమా ప్రమోషన్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సారి కరోనా వలన అతని స్టైల్ కాస్త మార్చాడు. ఎలాంటి ఈవెంట్స్ లేకుండా కేవలం సోషల్ మీడియా ద్వారానే సినిమా ప్రమోషన్ చేయనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్రమోషన్స్ ఈవెంట్స్ ను లీడ్ చేసే బాధ్యత రాజమౌళి.. ఎన్టీఆర్కు ఇచ్చాడు. ఈ విషయాన్నిచిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
కొద్ది సేపటి క్రితం ఎన్టీఆర్ ఇన్స్టాగ్రాములో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో రామ్ చరణ్ని డ్యాన్స్ ప్రాక్టీస్ అయిందా అని అడిగాడు ఎన్టీఆర్. టేబుల్పై వాయిస్తూ అయిపోయిందని అన్నాడు. పొద్దున్నించి కూర్చొపెట్టారు. దసరాకి రిలీజ్ అంటూ కార్తికేయతో మాట్లాడుతూ కనిపించాడు చరణ్. ఈ వీడియో నెటిజన్స్ని ఆకట్టుకుంటుంది.
అక్టోబర్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో రాజమౌళి వేసిన కొత్త ప్రమోషన్ ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది.