RRR Ticket Rates | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అత్యంత గ్రాండ్గా మార్చి 25న విడుదల కానుంది. ఈ క్రమంలో టిక్కెట్ రేట్లను పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజులు(మార్చి25-మార్చి27) వరకు మల్టీప్లెక్స్లలో రూ.100, తర్వాత వారం రోజులు(మార్చి28-ఏప్రిల్3) రూ.50 పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.50, ఆ తర్వాత వారం రోజుల పాటు రూ.30 పెంచుకునే అవకాశం కల్పించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైన పది రోజుల వరకు రోజుకు 5 షోలు వేసుకునే వెసలుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.మూడు రోజులవరకు టిక్కెట్ల ధర సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.233గా ఉండగా.. మల్టీప్లెక్స్లో రూ.413 ఉండనుంది.
ఏపీ ప్రభుత్వం ఈ చిత్రానికి రూ.75 పెంచుకోవచ్చని తెలిపింది.కార్పోరేషన్లో సింగిల్ స్క్రీన్లలో రూ.236, మల్టీప్లెక్స్లలో రూ.265గా ఉండగా,మున్సిపాలిటీలో అయితే ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్లో రూ.206, మల్టీప్లెక్స్లలో రూ.236 గా ఉండనుంది. ఇతర ప్రాంతాలలో సింగిల్ స్క్రీన్లో రూ.195 మల్టీప్లెక్స్లో రూ.206గా పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం జీవో జారి చేసింది.ఈ రేట్లు చిత్రం విడుదలైన 10రోజుల వరకు వర్తిస్తాయని ఇటీవలే ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన మొమోలో ఉంది.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఆలీయా భట్, ఒలీవియా మొర్రీస్లు హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్దేవగణ్ కీలకపాత్రలో నటించాడు. డివివి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని 550కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించాడు. ప్రస్తుతం ట్రిపుల్ఆర్ బృందం ప్రమోషన్లలో బిజీగా గడుపుతుంది.