ఆ కాలం నటీనటులు రోజా రమణి, చక్రపాణి దంపతుల కుమారుడు తరుణ్ మనసు మమత అనే చిత్రంతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆ చిత్రానికి నంది అవార్డ్ కూడా దక్కించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలలో నటించి మెప్పించిన తరుణ్ ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారిన తరుణ్ .. ఆ తర్వాత ‘నువ్వు లేక నేను లేను’, ‘ప్రియమైన నీకు’, ‘నువ్వే నువ్వే’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోగా మారాడు.
తరుణ్ కెరీర్ గ్రాఫ్ ఎంత స్పీడ్గా పైకి వెళ్లిందో అంతే స్పీడ్గా పడిపోయింది. వరుసగా లవ్ స్టోరీతో సినిమాలు చేయడంతో లవర్ బాయ్ ఇమేజ్ను సైతం సొంతం చేసుకున్నాడు. ఒక రకంగా ఇదే అతడికి మైనస్ కూడా అయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా టాక్ షోకు హీరో తరుణ్ తల్లిదండులైన రోజా రమణి, చక్రపాణి దంపతులు రాగా, వారు స్విట్జర్లాండ్లో జరిగిన ఓ చేదు ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు.
తరుణ్ ఎక్కువగా పూజలు చేస్తుంటారు . అందుకుని షూటింగ్కు ఎక్కడికి వెళ్లినా అగర్బత్తిలు, కర్పూరం తీసుకుని వెళ్తాం. అలా స్విడ్జర్లాండ్లోని హోటల్లో తరుణ్ అవి వెలిగించి పూజలు చేస్తుండగా.. పొగలు వచ్చి ఫైర్ అలారం మోగింది. దీంతో వెంటనే నలుగురు పోలీసులు మమ్మల్ని అందరినీ చుట్టుముట్టారు అంటూ ఆ నాటి చేదు అనుభవాలని వివరించారు తరుణ్ పేరెంట్స్. ఇటీవలే ‘అనుకోని అతిథి’లో హీరోకు డబ్బింగ్ చెప్పాడు తరుణ్.