గోల్మాల్, సింగం, చెన్నై ఎక్స్ ప్రెస్, దిల్వాలే, సింబా లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీని షేక్ చేశాడు బాలీవుడ్ (Bollywood) దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty). ఇండియాలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరు. ఈ స్టార్ డైరెక్టర్కు సంబంధించిన క్రేజీ వార్త ఇపుడు బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. రోహిత్ శెట్టి డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నాడట. అమెజాన్ నౌ (Amazon now)లో సాలిడ్ కాప్ సిరీస్ను డైరెక్టర్ చేయబోతున్నట్టు బాలీవుడ్ సర్కిల్ సమాచారం.
సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) మెయిన్ లీడ్ రోల్లో నటించనున్న ఈ సిరీస్ వచ్చే వారం నుంచి మొదలు కానుంది. మరోవైపు రోహిత్ శెట్టి బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్తో సర్కస్ సినిమా చేస్తున్నాడు. ఇదివరకెన్నడూ చూపించని విధంగా సరికొత్త అవతార్లో రణ్వీర్ను చూపించబోతున్నాడ. ఇక సిద్దార్థ్ మల్హోత్రా ప్రస్తుతం థ్యాంక్ గాడ్, యోధ చిత్రాల్లో నటిస్తున్నాడు.
బాలీవుడ్లో కాప్ సినిమాలు తీయడంలో దిట్ట రోహిత్ శెట్టి. సింగం, సింబా, సూర్యవంశి చిత్రాలు బాక్సాపీస్ వద్ద సృష్టించిన రికార్డులే దీనికి నిదర్శనం. సిల్వర్ స్క్రీన్పై పోలీస్ పాత్రలతో అదరగొట్టిన రోహిత్ శెట్టి మరి డిజిటల్ ప్లాట్ఫాంను ఏ విధంగా షేక్ చేస్తాడో చూడాలి.