RGV | సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించేవారు. కాని ఇప్పుడు వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమాలు తీసిన కూడా కాంట్రవర్సీనే. ట్వీట్ చేసిన కాంట్రవర్సీనే. తాజాగా రామ్ గోపాల్ వర్మ.. ట్రంప్ ట్వీట్కి సెటైరికల్గా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం వర్మ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. మేటర్లోకి వెళితే కొద్ది రోజులుగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ స్థాయికి చేరుకున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పహల్గాంలో 26 మంది పర్యాటకులని ఉగ్రవాదులు కిరాతకంగా చంపేయడంతో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసింది.
అయితే దీనికి ప్రతిగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో భారత్లోని జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లను లక్ష్యంగా చేసుకుంది. భీకర దాడులు జరుగుతున్న సమయంలో ట్రంప్ మే 10న మధ్యాహ్నం తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టారు. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణపై పూర్తిగా, తక్షణంగా అంగీకరించాయని ప్రకటించారు. ఇది తన మద్యవర్తిత్వ విజయంగా ఆయన తెలియజేశారు .. రెండు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించడం పట్ల సంతోషిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాలు చాలా బాగా అర్ధం చేసుకుని అంగీకరించినందుకు రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు కూడా తెలియజేశారు. ఈ విషయంపై శ్రద్ధ చూపినందుకు భారత్, పాకిస్తాన్కు ధన్యవాదాలు అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
అయితే ఈ ట్వీట్ పట్ల ఆర్జీవీ స్పందిస్తూ..నువ్వు చెప్పకుంటే మాకు కామన్ సెన్స్ కాని తెలివి కాని లేవా? నువ్వు వచ్చి మాకు నేర్పిస్తున్నావా? అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ వైరల్గా మారింది. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రి సుదీర్ఘంగా మొత్తం జరిగిన చర్చల అనంతరం భారత్, పాకిస్తాన్ పూర్తి స్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్.. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తెలియజేశారు. అయితే కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ తన మాట తప్పింది. సాయంత్రం తరువాత జమ్మూ-కశ్మీర్, పంజాబ్లలో డ్రోన్ దాడులు మొదలయ్యాయి. శ్రీనగర్లో రాత్రి 8 గంటల సమయంలో 6–8 భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే, భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఈ దాడులను విఫలమయ్యేలా చేసింది. ఇదేనా కాల్పుల విరమణ? శ్రీనగర్లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు కాల్పులు ప్రారంభించాయి!” అంటూ జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మండిపడ్డారు.