‘మేఘా ఆకాష్ను నలభైఏళ్ల క్రితం చూసుంటే నేను విడాకులు తీసుకునేవాణ్ణి కాదు. ఆమె చాలా స్వీట్ పర్సన్. మేఘాను కలిసిన వాళ్లందరికీ చక్కెర వ్యాధి వస్తుందని అనుకుంటున్నా’ అని చమత్కరించారు దర్శకుడు రామ్గోపాల్వర్మ. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘డియర్మేఘ’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరుణ్ అదిత్, మేఘా ఆకాష్, అర్జున్ నాయకానాయికలుగా నటించారు. సుశాంత్రెడ్డి దర్శకుడు. అర్జున్ దాస్యన్ నిర్మాత. సెప్టెంబర్ 3న ఈ చిత్రం విడుదలకానుంది. రామ్గోపాల్వర్మ మాట్లాడుతూ ‘ప్రచార చిత్రాలు, పాటలు చూస్తుంటే చాలా రోజుల తర్వాత తెలుగులో రూపొందిన మంచి ఫీల్గుడ్ ఎంటర్టైనర్ సినిమా అనిపిస్తోంది’ అని తెలిపారు. ఎమోషనల్ లవ్స్టోరీ ఇదని, తన పేరుతో సినిమా రూపొందడం ఆనందంగా ఉందని మేఘా ఆకాష్ చెప్పింది. అరుణ్ అదిత్ మాట్లాడుతూ ‘మనసుపెట్టి చేసిన చిత్రమిది. కుటుంబమంతా కలిసిచూసేలా ఉంటుంది’ అని పేర్కొన్నారు. శ్రీదేవితో సినిమా చేసినప్పుడు ఆర్జీవికి ఎంత కిక్ వచ్చిందో అదే అనుభూతిని మేఘాతో పనిచేసినప్పుడు తాను పొందానని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం, బిగ్బాస్ సొహెల్ తదితరులు పాల్గొన్నారు.