గతేడాది ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు రవితేజ (Ravi Teja). ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. మాస్ మహారాజా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao)లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హేమలత లవణం పాత్రలో రేణూదేశాయ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్న టైగర్ నాగేశ్వర్రావులో రేణూదేశాయ్ రోల్కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. రేణూదేశాయ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో తన పాత్ర షూటింగ్ పార్ట్ పూర్తయిందని తెలియజేసింది. టైగర్ నాగేశ్వర్రావులో అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు కృతజ్ఞతలు సరిపోవు. ఓ కుటుంబంలా కలిసిపోయి నా ప్రతీ రోజు షూటింగ్ను చాలా సౌకర్యవంతంగా సాగేలా చేసిన చిత్రయూనిట్కు ధన్యవాదాలు అని క్యాప్షన్ పెట్టింది.
కొన్ని రోజుల క్రితం హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్టు ఓ అప్డేట్ కూడా అందించింది డైరెక్టర్ వంశీ టీం. టైగర్ నాగేశ్వర్ రావు 1970స్ కాలంలో స్టూవర్ట్పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్టుతో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది.
టైగర్ నాగేశ్వర్రావులో గాయత్రి భరద్వాజ్ సెకండ్ ఫీ మేల్ లీడ్ రోలో పోషిస్తోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తు్న్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
షూటింగ్పై రేణూదేశాయ్ పోస్ట్..