చాలా మందికి తెలుసో తెలియదో కానీ సెప్టెంబర్ 25 తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా బ్లాక్ డే. ఎందుకంటే వరసగా రెండు సంవత్సరాలలో ఇద్దరు ప్రముఖులు అదే రోజు కన్నుమూశారు. 2019 సెప్టెంబర్ 25న వేణు మాధవ్ మరణించాడు.. ఆ తర్వాత ఏడాది సెప్టెంబర్ 25న బాలసుబ్రమణ్యం మనకు భౌతికంగా దూరమయ్యారు. అందుకే సెప్టెంబర్ 25 అంటేనే తెలుగు ఇండస్ట్రీకి అసహ్యం.. భయం.. కోపం. వేణు మాధవ్ మనకు దూరమై అప్పుడే రెండేళ్లైపోయింది. తెలుగు సినిమా నవ్వు కొన్నేళ్లుగా మూగబోతూనే ఉంది. ఎందుకంటే మన దగ్గర వరసగా కమెడియన్లు ఒక్కొక్కరుగా పరలోకానికి పయనం అవుతున్నారు. టాలీవుడ్ పై తనదైన ముద్ర వేసిన వేణు మాధవ్.. తీవ్ర అస్వస్థతతో బాధ పడుతూ 2019, సెప్టెంబర్ 25న సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు.
చనిపోవడానికి కొన్ని రోజుల ముందు వరకు కూడా ఈయన చాలా అనారోగ్యానికి గురయ్యాడు. ఆ విషయం బయటికి రాకుండా ఎంత జాగ్రత్త పడినా కూడా చివరికి అదే ఆయన ప్రాణాలు తీసింది. 300 సినిమాలకు పైగా నటించి తనదైన శైలిలో నవ్వించాడు వేణు మాధవ్. కాలేయ సంబంధ వ్యాధితో పాటు కిడ్నీ సమస్య కూడా తలెత్తడంతో ఆయన మరణించాడు. తెలుగులో వేణు మాధవ్ ది ప్రత్యేకమైన శైలి. ఆయన కామెడీలో చాలా వేరియేషన్ ఉంటుంది. తనకంటూ ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్నాడు వేణుమాధవ్. మిమిక్రీ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించారు. కమెడియన్స్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముందు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఉన్న అభిమానంతో టీడీపీ ఆఫీసులోనే టెలిఫోన్ బాయ్ గా కూడా పని చేశాడు వేణుమాధవ్. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నాడు. తెలుగుదేశంతోనే కడవరకు ఉన్నాడు.
రాజకీయాల తర్వాత ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సంప్రదాయం’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు వేణుమాధవ్. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమాతో వేణు మాధవ్ దశ తిరిగిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు వేణుమాధవ్. తెలుగు చిత్రసీమలో కమెడియన్గా 300లకు పైగా చిత్రాల్లో ఆయన నటించాడు. సై సినిమాలో నల్లబాలు నల్లతాచు లెక్క.. నాకి సంపేస్తా అంటూ నవ్వించాడు. దిల్ లో అప్పట్లో భుట్టో ఇప్పుడు ముషారఫ్ అంటూ రప్ఫాడించాడు. పోకిరిలో బాబ్బాబూ అంటూ దుమ్ము దులిపేశాడు. ఇలా ఒకటా రెండా లక్ష్మీ సినిమాలో అయితే వేణు మాధవ్ కామెడీకి కడుపులు చెక్కలు కావడం ఖాయం. ఈ సినిమాతో నంది అవార్డు కూడా అందుకున్నాడు వేణు మాధవ్. 300 సినిమాల్లో 100 సినిమాలకు పైగా ఈయన పాత్రలు అలా గుర్తుండిపోయాయి ప్రేక్షకులకు. అలాంటి గ్రేట్ కమెడియన్ మనకు దూరమై అప్పుడే రెండేళ్లైపోయిందా అంటూ ప్రేక్షకులు కూడా గుర్తు చేసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Love story | లవ్స్టోరి సినిమా రివ్యూ
సాయిపల్లవిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందబ్బా..
ఇదే కదా నిర్మాతలు కోరుకుంది.. లవ్ స్టోరీ సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ పక్కా..!
Samantha Akkineni | సమంత లవ్స్టోరి సినిమా చూడదట!
అనుష్క పెళ్లి విషయంలో జ్యోతిష్కుడు కీలక వ్యాఖ్యలు