ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటీటీ వేదికల వల్ల భారతీయ ప్రేక్షకులకు సినిమాలపరంగా విస్తారమైన కంటెంట్ చేరువైందని, ప్రపంచ సినిమాను ఇంటి దగ్గరే వీక్షించే సౌలభ్యం కలిగిందని చెప్పారు బాలీవుడ్ దర్శకుడు మధుర్భండార్కర్. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు రీమేక్ చిత్రాలను మానుకోవాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడు వివిధ భాషా చిత్రాల్ని తమ ప్రాంతీయ భాషా సబ్టైటిల్స్తో ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. దాంతో సినిమా కథాంశం అందరికి తెలిసిపోతున్నది.
ఈ కారణంగా రీమేక్ కథలు ఏమాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేవు. ఇక నుంచి ఫిల్మ్మేకర్స్ అందరూ ఒరిజినల్ కంటెంట్ మీద దృష్టి పెట్టాలి’ అన్నారు. ‘ఇండియా లాక్డౌన్’ పేరుతో మధుర్భండార్కర్ తీసిన చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలైంది.