Naresh | సీనియర్ నటుడు నరేష్కు బెంగళూరులోని సిటీ సివిల్ న్యాయస్థానంలో ఊరట లభించింది. ఇటీవల ఆయన పవిత్రా లోకేష్తో కలిసి నటించిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రాన్ని థియేటర్తో పాటు ఓటీటీ ఫ్లాట్ఫామ్లో కూడా విడుదలను నిలిపివేయాలంటూ ఇటీవల నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వేసిన కేసును కోర్టు కొట్టేసింది. రెండు పక్షాల వాదనను విన్న న్యాయస్థానం, మెరిట్ లేని కారణంగా రమ్య రఘుపతి సమర్పించిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు కోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది.
సెన్సారు బోర్డు ఆమోదించిన విధంగా ఈ సినిమా పూర్తిగా కల్పితమని, ఇందులో పాత్రలు ఎవరికి సంబంధించినవి కావని, కోర్టు చెప్పింది. సెన్సారు బోర్డు ఒకసారి ఒక చిత్రాన్ని సెన్సారును పూర్తిచేసి కల్పితమని ధృవీకరిస్తే దాని విడుదలను ఇతరులు అడ్డుకునే హక్కు లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో పాటు నరేష్ ఫ్యామిలీకి చెందిన మరో కేసులోనూ కోర్టు ఈ రోజు ఉత్తర్వులిచ్చింది. నరేష్కు సంబంధించిన నానక్రామ్గూడ ఇంట్లోకి రమ్య రఘుపతి రాకుండా చూడాలని ఆయన ఫ్యామిలీకి చెందిన వారు గతంలో కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతి రాకూడదంటూ తీర్పు ఇచ్చింది.