మెగాస్టార్ చిరంజీవి నటుడిగా మంచి పీక్స్ లో ఉన్నాడు. వరుస ఆఫర్స్తో క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన ఓ రోజు పేపర్ చదువుతుండగా, అందులో బ్లడ్ లేక చాలా మంది చనిపోతున్నారని చదివారు. ఇది ఆయనని ఎంతగానో కలిచి వేసింది. ఇంత మంది ప్రజానీకంలో సమయానికి రక్తం ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాకపోవడం ఏంటని ఆయనలో ఆయన మదన చెంది తర్వాతి రోజే బ్లడ్ బ్యాంక్ దిశగా ఏర్పాట్లు మొదలు పెట్టారు.
1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ను స్థాపించిన ఆయన ఇప్పుడు ప్రాణదాతగా మారారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర మాట్లాడుతూ.. హేమ ప్రగ్నెన్సీ సమయంలో బ్లడ్ తక్కువైతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండే సాయం అందింది. ఆ రోజు ఈ బ్లడ్ బ్యాంక్ లేకపోతే ఆమె చనిపోయే వారు అని చెప్పాడు. ఎంతో మంది సహాయ సహాకరాలతో బ్లడ్ బ్యాంక్తో పాటు ఐ బ్యాంక్ నిర్వహిస్తున్నారు చిరు.
కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చూసి చలించిపోయిన చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఓ ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. త్వరలో ఆయన అంబులెన్స్ సర్వీస్ కూడా ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.