అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. సినీ పరిశ్రమపై ఏపీ నేతల వ్యాఖ్యల తీరును హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ధ్వజమెత్తారు. ‘మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా’ అని సవాలు విసిరారు. మీరు రాజకీయంలోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత ? ఇప్పుడెంత ? అని ప్రశ్నించారు. కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినీ పరిశ్రమ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ‘
రూ. కోట్లు ఖర్చు పెట్టి నాయకులను ఎన్నుకుంటున్నాం . మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం చేయడమెందుకని నిలదీశారు. సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలని, రాజకీయ నేతలు ఇంకెప్పుడు బెదిరింపులకు పాల్పడవద్దని సూచించారు. . సినీ పరిశ్రమ అంటే నిర్మాతల మండలి అని ఏపీ నేతలకు మరోమారు గుర్తు చేశారు.