ఈ మధ్యకాలంలో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరో అంటే బాలకృష్ణ మాత్రమే. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో సితార ఎంటైర్టెన్మెంట్స్ నిర్మిస్తున్న ‘ఎన్బీకే 109’చిత్రంతో డబుల్ హ్యాట్రిక్కి రెడీ అయ్యారు బాలయ్య. దుల్కర్ సల్మాన్, బాబీడియోల్, గౌతమ్ వాసుదేవ మీనన్.. ఇలా ఆసక్తికరమైన ప్యాడింగ్తో రూపొందుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలావుండగా, ఈ సినిమా తర్వాత బాలయ్య ‘అఖండ-2’ చేస్తారని చాలామంది అనుకున్నారు. అయితే.. తాజా అప్డేట్ అందుకు భిన్నంగా ఉంది. ‘శ్యాంసింగరాయ్’ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఇటీవలే బాలయ్యకు ఓ కథ వినిపించారట. ఆ కథ నచ్చడంతో నెక్ట్స్ ఈ ప్రాజెక్ట్నే పట్టాలెక్కించాలని బాలయ్య ఫిక్స్ అయ్యారని టాక్. ఓ వైపు బోయపాటి ‘అఖండ-2’ స్క్రిప్ట్ వర్క్ కూడా చివరి దశకు చేరుకుందని తెలుస్తున్నది. మరి బాలయ్య ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.