ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలో పాల్గొనేందుకు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర హీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్ ఇప్పటికే అమెరికాలోని లాస్ఏంజిల్స్కు చేరుకున్నారు. అక్కడ వరుసగా మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్ రెడ్ కార్పెట్పై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నడిచే విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రెడ్ కార్పెట్పై స్వాగతం స్వీకరించడం అన్నది గొప్ప గౌరవం. అయితే అక్కడ నడిచేది ఎన్టీఆర్ లేదా కొమురం భీమ్ అని నేను అనుకోను. అలాగే రాజమౌళి, రామ్చరణ్ కూడా అలా అనుకోవడం లేదు. భారతదేశాన్ని మా హృదయాల్లో నింపుకొని రెడ్కార్పెట్పై నడుస్తాం. ఆక్షణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని ఎన్టీఆర్ చెప్పారు.
రామ్చరణ్ మాట్లాడుతూ “నాటు నాటు’ ప్రజలందరూ మెచ్చిన పాట. భిన్న సంస్కృతులు, రాష్ర్టాలకు చెందిన వారు కూడా ఈ పాటను తమ పాటగా స్వీకరించారు. జపాన్ నుంచి అమెరికా వరకు ‘నాటు నాటు’ పాట ప్రతి ఒక్కరి హృదయాల్ని గెలుచుకుంది. ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమం కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా. నేను ఏ తారలనైతే చూస్తూ పెరిగానో వారిని అక్కడ చూడబోతున్నా. ‘ఆర్ఆర్ఆర్’ గొప్ప కళాత్మక చిత్రం. ఈ సినిమా విషయంలో ఆశించిన దానికంటే ఎక్కువ ప్రేమాభిమానాలు దక్కాయి. మక్కా ఆఫ్ సినిమా అయిన హాలీవుడ్లో మాకు గొప్ప గౌరవం లభిస్తున్నది’ అన్నారు.