ఒకప్పుడు టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Raviteja) ఎంత బిజీగా ఉండేవాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్ల కిందట ఈయన డేట్స్ కావాలంటే ఎంత పెద్ద నిర్మాత అయినా రెండేళ్లు ఎదురు చూడాల్సిందే. అలాంటి హీరో ఆ తర్వాత కాలంలో కాస్త నెమ్మదించాడు. వరుస పరాజయాలతో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే రవితేజ..రెండు మూడేళ్లకు ఓ సినిమా కూడా చేశాడు. అయినా ఇండస్ట్రీలో పారితోషికం (Remuneration) పెరగాలన్నా..తగ్గాలన్నా ఒక్క సినిమా చాలు. ఒకట్రెండు ఫ్లాపులు వచ్చాయంటే 10 కోట్లు తీసుకునే హీరో 5 కోట్లకు కూడా ఓకే అనాల్సిందే. కానీ అదే హీరోకు ఒక్క హిట్ వచ్చిందంటే ముందు పోయింది కూడా మొత్తం తర్వాత సినిమాలకు లాగేస్తుంటారు. ఇప్పుడు రవితేజ కూడా ఇదే చేస్తున్నాడు. రెండు, మూడేళ్ల కింద ఈయన పారితోషికం 10 కోట్ల లోపు ఉంది.
ఇంకా చెప్పాలంటే కొందరు సీనియర్ నిర్మాతల (Senior Producers)కు ఈయన 5 కోట్ల పారితోషికంతోనే సినిమాలు కూడా చేసాడు. అయితే అదంతా ఒకప్పుడు. క్రాక్ (Krack) సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజాకు ఇప్పుడు సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ హీరో చేతిలో ప్రస్తుతం 5 సినిమాలున్నాయి. ఖిలాడి (khiladi) సినిమాతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు రవితేజ.
కొత్త దర్శకుడు అయినా కూడా ఆయన చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశాడు. అయితే ఈ సినిమా ఒప్పుకోవడం వెనక మరో కథ కూడా ఉంది. ఇందులో నటించడానికి రవితేజ రూ.15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మాస్ రాజా మార్కెట్ మళ్లీ పెరిగింది. దాంతో ఈయన రెమ్యునరేషన్కు కూడా రెక్కలు వచ్చాయి. మరోవైపు శరత్ సినిమాలో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ సినిమా కోసం కేవలం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడు రవితేజ. ఈ లెక్కన ఆయన పారితోషికం రోజుకు 50 లక్షల పైగానే ఉంది.
30 రోజుల్లో రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ అంటే చిన్న విషయం కాదు. కానీ రవితేజకు మార్కెట్ వుంది కాబట్టి నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అలాగే ఖిలాడీ (khiladi) సినిమాకు 10 కోట్లకు పైనే పారితోషికం అందుకుంటున్నాడు మాస్ రాజా. క్రాక్ సినిమాకు ముందు 5 కోట్ల పారితోషికం కూడా తీసుకున్న మాస్ రాజా.. ఒక్క విజయం రాగానే పారితోషికం రెండింతలు పెంచేశాడు. అంతే మరి ఇండస్ట్రీలో హిట్ వచ్చినప్పుడు ఉండే విలువ ఇంకెప్పుడూ ఉండదు. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రవితేజకు ఈ విషయం తెలియంది కాదు.
ఈ మధ్య త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) దర్శకత్వంలో ధమాకా సినిమా అనౌన్స్ చేసిన రవితేజ.. ఇప్పుడు మరో రెండు సినిమాలు కూడా లైన్ లో పెట్టాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో ఒక సినిమా.. వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటించబోతున్నాడు రవితేజ. ఇందులో టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా సినిమాగా రానుంది. దీని కోసం ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ రవితేజ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా 5 సినిమాలతో రవితేజ మామూలు దూకుడు మీద లేడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?