తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం అన్నాత్తే (Annaatthe). తెలుగులో పెద్దన్నగా విడుదల కాబోతుంది. నవంబర్ 4న దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల కానుండగా..మీనా (Meena) స్పెషల్ స్టిల్ ఒకటి ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందరితో పంచుకుంది. చెన్నైలో ఇవాళ అన్నాత్తే ప్రి రిలీజ్ ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా కీర్తిసురేశ్ (Keerthy Suresh), ఖుష్బూ (Khushboo)తో కలిసి దిగిన సెల్ఫీని మీనా షేర్ చేయగా నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది.
అలనాటి అందాల తారలు మీనా, ఖుష్బూ సంప్రదాయ వస్త్రధారణలో ట్రెండీ జ్యువెల్లరీతో కనిపిస్తుండగా వారితో కీర్తిసురేశ్ చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ తీసింది. పింక్, వయొలెట్, గ్రీన్ శారీల్లో ఈ ముగ్గురు అందాల తారల ఫొటో అందరినీ ఆకట్టుకుంటుంది. నయనతార ఈ ఈవెంట్కు మిస్సయింది.
సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..శివ దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార మెయిన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..రజినీకాంత్ సోదరిగా కీర్తిసురేశ్ కనిపించనుంది.
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్లో తమన్నా..తాజా అప్డేట్
Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!