నాగ చైతన్య నుండి విడిపోయాక సమంత పూర్తిగా సినిమాలపై దృష్టి సారించింది. వరుస ప్రాజెక్టులకి సైన్ చేస్తుంది.ఇప్పటికే శ్రీదేవి మూవీస్ సినిమా.. డ్రీమ్ వారియర్ సినిమా కి సంతకాలు చేసింది. నాని కథానాయకుడిగా నటించనున్న దసరా అనే చిత్రానికి సమంతను కథానాయికగా పరిగణిస్తున్నారని కథనాలొచ్చాయి. దీనికి సంబంధించి క్లారిటీ రావలసి ఉంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజీ పాత్రతో ఉత్తరాది ఆడియెన్స్ని సమంత ఎంతగానో అలరించడంతో ఆమెకు పలు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయట.
ఇప్పుడు బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా ఉన్న తాప్సీ తన ప్రొడక్షన్ హౌజ్లో సమంత హీరోయిన్గా ఓ సినిమా చేయాలని అనుకుంటుందట. తాప్సీ ఔట్ సైడర్స్ ఫిల్మ్స్ బ్యానర్ లో సమంత ప్రధాన పాత్రలో రూపొందే ఈ థ్రిల్లర్ చిత్రంకి సంబంధించి ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం. అతి త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. సామ్ నటించిన శాకుంతలం .. కత్తువాకుల రెండు కాదల్ చిత్రాలు తదుపరి విడుదలకు రానున్నాయి. నవంబర్ నుంచి ఇప్పటికే సంతకాలు చేసిన వాటి షూటింగ్లు ప్రారంభించనున్నారని సమాచారం.