ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో విజయవంతంగా కెరీర్ సాగిస్తున్నారు హీరో శర్వానంద్. వేటికవి భిన్నమైన చిత్రాల్లో నటించడం శర్వానంద్ ప్రత్యేకత. సోలో హీరోగా నటిస్తున్నా…మల్టీస్టారర్స్ అంటే ఇష్టమేనని చెబుతుంటారీ కథానాయకుడు. ప్రస్తుతం శర్వానంద్ ఓ మల్టీస్టారర్ మూవీకి అంగీకారం తెలిపినట్లు తెలుస్తున్నది. ‘కలర్ ఫొటో’ చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ ఇద్దరు హీరోలు ఉండే ఓ కథను శర్వానంద్కు వినిపించారని, ఈ స్క్రిప్ట్ ఆయనను ఆకట్టుకుందని సమాచారం. ఈ సినిమా చేసేందుకు శర్వానంద్ సుముఖంగా ఉన్నారట. ఇక మరో హీరోగా మాస్ స్టార్ రవితేజ నటిస్తారని అంటున్నారు. రవితేజకు కూడా శర్వానంద్తో మల్టీస్టారర్ అంటే అభ్యంతరం ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా సెట్స్ మీదకు వస్తే మరో కొత్త కాంబినేషన్ మల్టీస్టారర్ తెలుగు ప్రేక్షకుల కోసం సిద్ధమవుతున్నట్లే భావించాలి.