జయాపజయాలకు అతీతంగా వేగంగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు రవితేజ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. తాజాగా షెడ్యూల్ని లక్నోలో మొదలుపెట్టారు. ఈ కీలక షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్ని చిత్రీకరించనున్నారు హరీశ్శంకర్. ‘నామ్ తో సునా హోగా’ అనే ఉపశీర్షికతో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సరికొత్త రవితేజను ఆడియన్స్ చూస్తారని హరీశ్శంకర్ చెబుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్, సంగీతం: మిక్కీ జె.మేయర్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్.