కార్తీక్ రత్నం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఆర్టీ టీమ్వర్క్స్ పతాకంపై అగ్రహీరో రవితేజ నిర్మిస్తున్నారు. కుషిత కల్లపు కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి విష్ణువిశాల్ కెమెరా స్విఛాన్ చేయగా, రవితేజ క్లాప్నిచ్చారు. రవిబాబు గౌరవ దర్శకత్వం వహించారు.
‘క్రైమ్ కామెడీ కథాంశమిది. ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రంలోని పాపులర్ పాట నుంచి ఈ టైటిల్ను తీసుకున్నాం. ఆద్యంతం ఉత్కంఠను పంచే కథ, కథనాలతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని దర్శకుడు తెలిపారు. సత్య అక్కల, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుందర్ ఎస్.సి, ఆర్ట్: శ్రీనివాస్ నార్ని, సంగీతం: కృష్ణ సౌరభ్, స్క్రీన్ప్లే: జనార్దన్ పసుమర్తి, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్: శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు, రచన-దర్శకత్వం: సతీష్ వర్మ.