రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్శంకర్ దర్శకుడు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో వేగం పెంచారు. ఈ సినిమాలోని రొమాంటిక్ మెలోడీ సాంగ్ ‘జిక్కీ’ ఈ నెల 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం కొత్తపోస్టర్ను విడుదల చేశారు.
మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ పాట మెలోడియస్ రొమాంటిక్ నెంబర్గా సంగీతప్రియుల్ని మెప్పిస్తుందని, నాయకానాయికలు రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ హైలైట్గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో అమితాబ్బచ్చన్ అభిమానిగా రవితేజ కనిపించనున్నారు. మాస్, కామెడీ, యాక్షన్ అంశాల కలబోతగా దర్శకుడు హరీష్శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని మేకర్స్ తెలిపారు. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, రచన-దర్శకత్వం: హరీష్శంకర్.