రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం టీజర్ను విడుదల చేశారు.
ఆద్యంతం హాస్యప్రధానంగా ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో టీజర్ ఆకట్టుకుంది. రవితేజ తన సమస్యని ఓ సైకాలజిస్ట్కు చెప్పుకోవడం, అతను ఇచ్చే సలహాలు, వాటి చుట్టూ పండే వినోదంతో టీజర్ సాగింది. వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, సత్య పాత్రలు వినోదాన్ని పంచాయి. రవితేజ తనదైన శైలి కామెడీతో మెప్పించారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల.